Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి
కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు .
అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం .
జిల్లా సెషన్స్ జడ్జిగా,
జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్
సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి.
(మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)